న్యూఢిల్లీ: ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిపోయింది. అందులో పంజాబ్ రెజిమెంట్ జవాన్లు రైతులతో కలిసి నిరసన తెలుపుతున్నట్లుగా ఉంది. ఓ టెంట్ కింద రైతులకు మద్దతుగా జవాన్లు నిలబడినట్లు అందులో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో నకిలీదని ఇండియన్ ఆర్మీ ఆదివారం స్పష్టం చేసింది. విధుల్లో ఉన్న ఆర్మీ జవాన్లు ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతున్న సమయంలో మాజీ సర్వీసు ఉద్యోగులు టీలు అందించినట్లు ఆర్మీ తెలిపింది. అంతేతప్ప టెంట్లో రైతులతో కలిసి పంజాబ్ రెజిమెంట్ జవాన్లు ఆందోళనలో పాల్గొన్నారన్న వార్తల్లో నిజం లేదు అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 26 నుంచి రైతులు వివిధ చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.