బెంగళూరు, జూన్ 23: ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనకు వస్తున్నారని అధికారులు రూ.23 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఇందులో రూ.6 కోట్లు ఖర్చు పెట్టి తారు వేసిన రోడ్డు మోదీ పర్యటించి వెళ్లిన మరుసటి రోజే ఇలా కుంగిపోయింది.
బెంగళూరుకు చెందిన ఫొటో జర్నలిస్టు అనంత సుబ్రమణ్యం ఈ రోడ్డు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘ఈ రోడ్డు ఏప్రిల్లో కుంగిపోయింది. అలాగే వదిలేశారు. ఇటీవల మోదీ వస్తున్నారని రిపేర్ చేశారు. అదృష్టవశాత్తూ మోదీ కారుకు ఏం కాలేదు. దేవుడా కృతజ్ఞతలు’ అని ఎద్దేవా చేశారు.