చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
గంగాధర, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని గంగాధర వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వ తోడ్పాటుతో ఈ ఏడాది సాగు విస్తీర్ణంతో పాటు ధాన్యం దిగుబడి పెరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు ఎండీ నజీర్, వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, మాల చంద్రయ్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, అట్ల శేఖర్రెడ్డి, వేముల అంజి, గర్వందుల పరశురాములు, దూలం శంకర్గౌడ్, తోట మహిపాల్, కోల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.