న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వచ్చిందంటే మందు పార్టీ.. వీకెండ్ వచ్చినా మందు పార్టీ.. పండుగకో మందు పార్టీ.. ఇలా పార్టీలు చేసుకొని రోడ్ల మీదికి బైక్లు, కార్లు డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చట్టంలో ఉన్న జరిమానాలు, జైలు శిక్షలు సరిపోవని.. మరింత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అంటున్నారు. తాగినవాళ్లు కారు ముట్టే చాన్స్ కూడా ఉండొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో విజయవంతంగా అమలవుతున్న కారు ఇగ్నిషన్తో అనుసంధానమై ఉండే బ్రీత్ అనలైజర్ టెస్ట్ను అందుబాటులోకి తేవాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో తాగి దొరికితే అక్కడ కారుకు బ్రీత్ అనలైజర్ను అమర్చుతారు. కారు నడిపే వ్యక్తి ఆ పరికరంలో ఊది, తాగలేదని తేలాకే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వినూత్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాగి కారు నడిపి ఏటా వేల మంది చనిపోతున్నారని, ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
యూకే:
ఆరు నెలల జైలు శిక్ష
అన్లిమిటెడ్ ఫైన్
ఒక సంవత్సరం పాటు డ్రైవింగ్ బ్యాన్
అమెరికా:
ఆస్ట్రేలియా:
భారత్:
మొదటిసారి..
రెండోసారి..