చండీగఢ్, మే 2: విద్యుత్తు ఆదా కోసం పంజాబ్లోని ఆప్ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకొన్నది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 7:30 గంటల నుంచే పని మొదలెట్టారు.
ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఇప్పటివరకూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉండగా, ప్రస్తుతం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగేలా మార్పులు చేశారు. 30 నిమిషాల లంచ్ టైంను ఎత్తేశారు. ఈ కొత్త పనివేళలు జూలై 15 వరకు అమల్లో ఉంటాయని, రూ.40 కోట్ల నుంచి రూ. 42 కోట్లదాకా ఆదా అవుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.