NCERT | న్యూఢిల్లీ : సిలబస్ మార్పు, పాఠ్య పుస్తకాల విడుదలపై ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన చేసింది. 3, 6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలను విడుదల చేయనున్నట్లు ఎన్సీఈఆర్టీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగతికి సంబంధించిన పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక 4, 5, 9, 11వ తరగతులకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశ వ్యాప్తంగా విడుదల చేసినట్లు పేర్కొంది. మారిన కరికులమ్కు అనుగుణంగా 6వ తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా టీచర్ల కోసం ఎన్సీఈఆర్టీ పోర్టల్లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉందని తెలిపింది. అన్ని పాట్య పుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ వెబ్సైట్తో పాటు DIKSHA, ePathshala పోర్టల్, యాప్లలో ఉచితంగా లభిస్తాయని పేర్కొంది.
Updated news from NCERT! New textbooks aligned with NCF-SE 2023 for Class 3 and 6 are arriving: Class 3 books by April 2024 and Class 6 by mid-May 2024. A bridge course for Class 6 is on the NCERT portal for teacher prep. Also 1.21 Cr copies of 2023-2024 editions for various… pic.twitter.com/Sh3D3oZKE9
— NCERT (@ncert) April 4, 2024