ఆర్కేపురం (వికారాబాద్) : పార్లమెంట్లో తెలంగాణ (Telangana ) గళం విప్పాలి అంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ( Sabhita Indra reddy) పిలుపునిచ్చారు. మంగళవారం సరూర్నగర్ డివిజన్లో సీనియర్ సిటిజన్లు, హుడా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ రాష్ట్రంపై ఒక విజన్ ఉన్న నాయకుడని, అన్ని రంగాలను ఒకే తాటిపై తీసుకువచ్చి విజయవంతంగా నడిపిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎలాంటి అవగాహన లేకుండా పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. తాగునీటి ఎద్దడితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.
అంతకు ముందు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న తిరుమల్ నగర్కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు (Parliament) బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ పనులను పరిశీలించారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేక పోవడం వల్ల తాగునీటి ఎద్దడి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్య మంత్రి రేవంతర్రెడ్డి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.