న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేసుల లిస్టింగ్ కోసం త్వరలో ఓ కొత్త విధానాన్ని తీసుకువస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ సోమవారం పేర్కొన్నారు. అత్యవసర కేసులు ఏమైనా ఉంటే విచారణ కోసం కోర్టును అభ్యర్థించే కంటే ముందుగానే రిజిస్ట్రార్ దృష్టికి తీసుకురావాలని న్యాయవాదులను కోరారు. గురువారం నాటికి కొత్త విధానం అందుబాటులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు కేసులపై చాంబర్లో పరిశీలన చేస్తామని, అత్యవసరం అనుకుంటే లిస్టింగ్ చేస్తామని తెలిపారు. రిజిస్ట్రార్ ముందు కేసులను ప్రస్తావించే పద్ధతికి తిరిగి వెళ్తామని పేర్కొన్నారు. సీజేఐగా తొలిసారి సోమవారం ప్రొసీడింగ్స్ చేపట్టిన జస్టిస్ లలిత్కు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, ఇతర న్యాయవాదులు శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం 60 పిల్స్తో సహా 900కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ అయ్యాయి. వీటిలో సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం 62 పిటిషన్లపై విచారణ చేసింది