న్యూఢిల్లీ: అయోధ్య రామాలయ(Ayodhya Ram Temple) నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఆలయ శిఖరం వద్ద పనులు జరుగుతున్నాయి. గర్భగుడి నిర్మాణం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆలయ పనులకు చెందిన తాజా ఫోటోలను ట్రస్టు రిలీజ్ చేసింది. రామ్లలా ప్రాణ ప్రతిష్ట కోసం జోరుగా అక్కడ పనులు జరుగుతున్నాయి. తాజాగా ట్రస్టు రిలీజ్ చేసిన ఫోట్లో ఆలయం పూర్తిగా దర్శనం ఇస్తోంది.
రామమందిరానికి చెందిన మొదటి ఫ్లోర్ పనులు నిర్మాణంలో ఉన్నాయి. గర్భగుడి పూర్తిగా తయారై సిద్ధంగా ఉంది. రామ్లల్లాకు చెందిన బాలుడి మూర్తులను కూడా తయారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్నది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వీవీఐపీలు హాజరుకానున్నారు.
जय श्रीराम 🛕 🚩🚩
मंदिर वहीं बन रहा है…
श्रीराम जन्मभूमि मंदिर निर्माण कार्य की वर्तमान स्थिति.. pic.twitter.com/XOoQ6JZfjl— BJP (@BJP4India) December 8, 2023