న్యూఢిల్లీ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు, యజమానులు ఇచ్చే వాటాలను సేకరించి దీర్ఘకాలిక ప్రభుత్వ హామీ ఉన్న సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టి ప్రతి సంవత్సరం అందులో వడ్డీని జమ చేస్తారు. గిగ్ వర్కర్లకు 60 ఏండ్లు వచ్చాక ఈ పథకంలో ప్రతిపాదించిన టార్గెట్ రిటైర్మెంట్ సమ్ను అప్పటికి అమల్లో ఉన్న అన్యుటీ, వడ్డీ రేట్ల ఆధారంగా నెలవారీ పెన్షన్గా సమకూరుస్తారని కేంద్రానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఈ కొత్త పథకాన్ని ఈపీఎఫ్వో చేపట్టే తదుపరి సంస్కరణలలో భాగంగా అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ పెన్షన్ పథకంలో లేని కార్మికులకు కూడా పెన్షన్ భద్రత కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న రిటైర్మెంట్ నిధుల విధానాలను అధ్యయనం చేసి అందులో అత్యుత్తమ పద్ధతులను అమలు చేయాలని చూస్తున్నట్టు సదరు అధికారి తెలిపారు.