న్యూఢిల్లీ, మే 16: దేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెలాఖరులో ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భవనం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు అయిన సందర్భంగా మే 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. రూ.970 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నాలుగంతస్థుల భవనంలో 1,224 మంది ఎంపీలు కూర్చునే సౌకర్యం ఉన్నది. కాగా, 2014లో మే 26నే ప్రధాని మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు.