అదనంగా రూ.750 చెల్లించాల్సిందే
గ్యాస్ రెగ్యులేటర్పైనా 100 వడ్డింపు
సామాన్యుడిపై మోదీ సర్కారు పిడుగు
న్యూఢిల్లీ, జూన్ 15: ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటి వరకు కొత్త గ్యాస్ కనెక్షన్పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1,450 ఉండగా, రూ.750 కలుపుకొని.. రూ.2,200 అయ్యింది. చాలామంది వినియోగదారులు కనెక్షన్ తీసుకొనేప్పుడే రెండు సిలిండర్ బుడ్డీలు తీసుకొంటారు. అలాంటివారు రూ.4,400 సమర్పించుకోవాల్సిందే. అంతేకాదు.. గ్యాస్ రెగ్యులేటర్పైనా అదనంగా రూ.100 పెరిగింది. ఇప్పటి వరకు రూ.150 ఉండగా, దాని రేటును రూ.250కి పెంచారు.
5 కిలోల సిలిండర్ సెక్యూరిటీ ధర కూడా!
5 కిలోల సిలిండర్ సెక్యూరిటీని కూడా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటి వరకు సెక్యూరిటీ కింద రూ.800 వసూలు చేస్తుండగా, దాన్ని రూ.1,150కి పెంచేశాయి. కొత్త కనెక్షన్ తీసుకొనే సమయంలో పాస్బుక్కు రూ.25, పైప్కు రూ.150 చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.