న్యూఢిల్లీ: సోషల్ మీడియాను నియంత్రించడానికి అమలులోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకున్నది. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికే నూతన ఐటీ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చామని ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
దాదాపు ప్రభుత్వ నియంత్రణలోకి రాని డిజిటల్ మీడియా వేదికగా వెలుగు చూస్తున్న ఫేక్ న్యూస్ నుంచి ప్రజలను రక్షించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ రూల్స్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కేంద్రం ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. డిజిటల్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం.. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణమైందని గతంలో కొన్ని ఘటనలు జరిగాయని తెలిపింది. పబ్లిక్ ఆర్డర్ను కాపాడటం ప్రభుత్వ విధి అని పేర్కొన్నది.