ముంబై: ఐటీ చట్టంలో ఇటీవల చేసిన మార్పులను పరిశీలిస్తే వ్యంగ్యానుకరణ, వ్యంగ్య రచనలకు సంబంధించి ఈ చట్టం నుంచి రక్షణ లేదనిపిస్తోందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యాక్ట్ చెక్తో వాటికి రక్షణేది? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఐటీ చట్ట సవరణలో రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్కమ్రా దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ జీఎస్ పటేల్, జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వంపై అనుకరణ, వ్యంగ్యం వంటి న్యాయమైన విమర్శలకు ఈ చట్టం రక్షణ కల్పించడం లేదని కోర్టు పేర్కొన్నది.