న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నూతన శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను రాత్రివేళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి బుధవారం దీన్ని ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి.
ఈ క్షిపణి 1000-2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గత నెలలో మిషన్ దివ్యాస్త్రలో భాగంగా ఎంఐఆర్వీ ఆధారిత అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. తద్వారా ఎంఐఆర్వీ సాంకేతికత కలిగిన అగ్రదేశాల సరసన భారత్ నిలిచింది.