దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కరోనా కేసులు లక్ష దిగువకు చేరాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే కొత్తగా 1,99,054 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 7.25 శాతానికి తగ్గింది.
యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2.62 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 169.63 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.