న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం 332 మంది ఈ మహమ్మారి కారణంగా తనువు చాలించినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 11,982 మంది కోలుకున్నట్లు తెలియజేశారు.
ఈ క్రమంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుం భారత్లో కరోనా రికవరీ రేటు 98.25 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 263 రోజుల కనిష్టానికి చేరిందని అధికారులు తెలియజేశారు. ఇక్కడ ప్రస్తుతం 1,40,638 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకూ మొత్తం 109.08 కోట్లకు పైగా కరోనా డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.