చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ క్యాంపస్లోని రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో 58 మంది, మద్రాస్ ఐఐటీలో 17 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో అధికారులు రెండు క్యాంపస్లను క్లస్టర్లుగా మార్చారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కళాశాలల్లోని మూడు హాస్టళ్లలో 22 మంది బాలురు, 33 మంది బాలికలు కరోనా బారినపడ్డారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. కరోనా బారినపడ్డ విద్యార్థులంతా రాజా ముత్తయ్య మెడికల్కాలేజీ ఆసుపత్రిలో చేరారు. దీంతో కళాశాల క్యాపంస్ కంటైన్మెంట్ జోన్గా మారింది.
ముందుజాగ్రత్త చర్యగా.. అన్నామలై యూనివర్సిటీ పరీక్ష నిర్వహించగా.. 58 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరికొందరికి సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కొవిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను క్యాంపస్ను ఖాళీ చేయాలని కోరింది. ఈ మేరకు యూనివర్సిటీ బుధవారం సర్కులర్ జారీ చేసింది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించారు. 17 మంది విద్యార్థులు, ఇతర సిబ్బంది పాజిటివ్ పరీక్షించారు. వైరస్ బారినపడ్డ వారందరినీ క్వారంటైన్కు పంపామని తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పాజిటివ్గా తేలిన వారి కుటుంబ సభ్యులను సైతం హోం క్వారంటైన్లో ఉంచారు.