న్యూఢిల్లీ, జనవరి 9: నీట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7కు రీషెడ్యూల్ చేసినట్టు జాతీయ పరీక్షల బోర్డు మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు అర్హత కటాఫ్ తేదీని ఆగస్ట్ 15గా నిర్ణయించింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మార్చి 3న నిర్వహించాల్సి ఉన్నది. అయితే తాజాగా పరీక్ష తేదీని జూలై 7కి మార్చారు.
ప్రతిపాదిత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమల్లోకి వచ్చే వరకు నీట్-పీజీ పరీక్ష ద్వారానే వివిధ ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దేశవ్యాప్తంగా ఏకైక అర్హత పరీక్షగా నీట్-పీజీ పరీక్షను జాతీయ వైద్య కమిషన్ నిర్వహిస్తున్నది.