NEET PG 2023 | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: నీట్ పీజీ-2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్కు అర్హత మార్కుల శాతాన్ని జీరోకు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది.
దీంతో నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన అభ్యర్థులంతా మూడో రౌండ్ కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటీస్ జారీచేశాయి. అర్హులైన అభ్యర్థులు ఎంసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చునని అభ్యర్థులకు తెలిపింది.