ఎర్నాకుళం: జడ్జీలు దేవుళ్లు కారని, న్యాయవాదులు, కక్షిదారులు వారి ముందు చేతులు కట్టుకొని ఒదిగి ఉండాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక కేస్ విచారణ సందర్భంగా జస్టిస్ కున్హి కృష్ణ ఈ విషయాన్ని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. తన ఇంటికి దగ్గరున్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్టు ఒక మహిళ అలప్పుజ్జా ఎస్పీకి 2019లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలనను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీనిపై ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకున్న ఎస్ఐ ఆమె తనను ఫోన్లో దూషించారంటూ కేసు పెట్టారు. తన కేసును పరిశీలించాలంటూ ఆమె చేతులు జోడించి కన్నీళ్లతో న్యాయమూర్తిని ఆర్థించడంతో ఆయన పై వ్యాఖ్యలు చేస్తూ.. ఆమెపైనున్న కేసు కొట్టివేశారు.