న్యూఢిల్లీ: దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దేశంలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులున్నట్టు లోక్సభ సాక్షిగా వెల్లడైంది. గత 30 ఏండ్లుగా దేశంలోని హైకోర్టులలో 71 వేలు, కింది కోర్టులలో 1,01,837 కేసులు పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిస్తూ సుప్రీం కోర్టులోని ఐసీఎంఎస్ వ్యవస్థ ద్వారా పరిశీలించగా జూలై 1 నాటికి 69,776 కేసులు పెండింగ్లో ఉన్నట్టు వెల్లడైందన్నారు.