న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా బిల్డింగ్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ పేర్కొన్నది. ఇక ఆ బిల్డింగ్ ప్రమాదంలో మిస్సైనవారి గురించి వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. ఓ వ్యక్తి తన సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ వద్ద ఉన్న ఇస్మాయిల్ అనే వ్యక్తి తన సోదరి ఆచూకీ లేదని ఫిర్యాదు చేశారు.
బిల్డింగ్ ప్రమాదంతో లింకున్న 28 ఫిర్యాదులు తమకు అందినట్లు సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. మిస్సైన వ్యక్తులకు చెందిన సమాచారాన్ని పోల్చి చూస్తున్నట్లు తెలిపారు. ఓ హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు.
ముండ్కా బిల్డింగ్లో పనిచేస్తున్న వారి ఆప్తులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తన భార్య సేల్స్ మేనేజర్గా ఆ బిల్డింగ్లో పనిచేస్తోందని విజయ్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. నిన్న సాయంత్రం 4.10 నిమిషాలకు ఆమెతో పోన్లో మాట్లాడానని, మళ్లీ కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ మాట్లాడడం లేదని అతను తెలిపాడు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సందర్శించనున్నారు.