న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ పార్టీ (NSCP) కార్యాలయం నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ప్రఫుల్ పటేల్కు చెందిన ఫొటోను తొలగించారు. ప్రఫుల్ పటేల్ ఈ నెల 2న అజిత్పవార్తోపాటు మరో ఏడుగరు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి చీలిక వర్గంలో చేరడంతో విద్యార్థి నేతలు ఆయన చిత్రపటాన్ని తీసేశారు.
ప్రఫుల్ పటేల్ తమ పార్టీని వీడి వెళ్లిపోయారని, ఆయన ఇప్పుడు మా ఎన్సీపీ ఫ్యామిలీలో సభ్యుడు కాదని, అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్గా తమ కార్యాలయంలో పెట్టుకున్న ఆయన చిత్రపటాన్ని తొలగించామని ఎన్సీపీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షురాలు సోనియా దూహన్ చెప్పారు. ప్రఫుల్ పటేల్తోపాటు అజిత్ పవార్, మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల ఫొటోలను కూడా ఎన్సీపీ కార్యాలయాల నుంచి తొలగించామన్నారు.
ఎన్సీపీని వీడిన చీలిక వర్గం వెంటనే మహారాష్ట్రలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించడం.. ఆ సర్కారు అజిత్పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి, మిగతా 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టడం.. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి, మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారాలు చేయించడం.. ఇలా అన్నీ కొన్ని గంటల వ్యవధిలోనే చకచకా జరిగిపోయాయి.
NCP working President Praful Patel’s photo frame removed from the Nationalist Student Congress office in Delhi.
“We removed Praful Patel’s photo frame and all other leaders who left NCP since they are not part of the NCP family anymore…,” says NCP student wing national… pic.twitter.com/A0WWHg3zOt
— ANI (@ANI) July 3, 2023