Sharad Pawar : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీ వేదికగా విపక్ష నేతలు మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. ర్యాలీని ఉద్దేశించి ఎన్సీపీ, ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సీఎంలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలను జైలుపాలు చేస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తన చర్యలతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజ్యాంగ వ్యవస్ధలపై దాడికి తెగబడుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని అన్నారు. కాగా, ఈ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ తన భర్త అరవింద్ కేజ్రీవాల్ను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలులో పెట్టారని ప్రధాని నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడని, నిజాయితీపరుడని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను అడిగారు.
జైలుపాలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని, ఆయన రాజీనామా చేయాలా అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఆమె ప్రశ్నించారు. మీ కేజ్రీవాల్ సింహం లాంటి వాడని, ఆయనను ఎంతోకాలం కాషాయ పాలకులు జైల్లో బంధించలేరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితులు పాల్గొన్నారు.
Read More :