ముంబై: మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే, ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో తన వాహనం నుంచి దిగిన సుప్రియా సూలే ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. పూణేలోని హడప్సర్లో ఈ సంఘటన జరిగింది. హడస్పర్, స్వస్వాద్ మధ్య ఉన్న పాల్కీ హైవేపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తన కారులో గురువారం ప్రయాణించారు. అయితే అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఇరువైపులా బారులు తీరాయి.
కాగా, ఇది గమనించిన సుప్రియా సూలే తన వాహనం నుంచి కిందకు దిగారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ఆమె ప్రయత్నించారు. అనంతరం ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హడప్సర్ నుంచి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ రహదారి పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. ఇక్కడ నిరంతరం ట్రాఫిక్ జామ్ ఉంటుందని తెలిపారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఈ సమస్యను సుప్రియా సూలే తీసుకెళ్లారు. ‘ఈ పనిని వెంటనే చేపట్టాలని నేను మిమ్మల్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి దీని గురించి సానుకూలంగా స్పందించండి’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే అక్కడి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న వీడియో క్లిప్ను కూడా సుప్రియా సూలే పోస్ట్ చేశారు.
हडपसर ते सासवड या पालखी महामार्गाकडे तातडीने अगदी 'टॉप प्रायोरिटी'वर लक्ष देण्याची गरज आहे. या रस्त्याची प्रचंड अशी दुरवस्था झाली असून सातत्याने येथे वाहतूक कोंडी होते.आता तर अशी अवस्था आहे की येथे एक गाडी जरी बंद पडली तरी प्रचंड अशी वाहतूक कोंडी होते. pic.twitter.com/sRFfh4vn0s
— Supriya Sule (@supriya_sule) October 20, 2022