మన్సూరాబాద్, మే 01: నాగోల్ చెరువును సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ చెరువులో గత వారం రోజులుగా చేపట్టిన గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను శనివారం ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. సుమారు 50 మంది సిబ్బందితో గుర్రపుడెక్కను తొలగింపజేస్తున్నామని తెలిపారు. చెరువులోని మురుగునీటి ద్వారా లార్వా వృద్ధి చెందకుండా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలని ఎంటమాలజీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.