ముంబై : చత్తీస్ఘఢ్లోని గచ్చిరోలి జిల్లా మద్వేలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నక్సల్స్ శిబిరాన్ని ధ్వంసం చేశారు. గడ్చిరోలి పోలీసులు ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా నక్సల్స్ కాల్పలు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. నక్సల్స్ ఘటనా స్ధలం నుంచి పారిపోగా నక్సల్స్ శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.
ఈ దాడుల్లో నక్సల్స్ క్యాంప్ నుంచి పోలీసులు పెద్దసంఖ్యలో ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఈడీలు, కుక్కర్ బాంబులు, తీవ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్ధాలను పోలీసులు అడవుల్లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా దగ్ధం చేశారు. నక్సల్స్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులకు గచ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.