న్యూఢిల్లీ: ఎల్గార్ పరిషద్ కేసులో సామాజిక కార్యకర్త నవలఖా గృహనిర్బంధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 24 గంటల్లోగా ఆయనను గృహ నిర్బంధానికి తరలించాలని శుక్రవారం ఆదేశించింది. ఈ నెల 10న నవలఖా ఆరోగ్యం దృష్ట్యా ఆయనను జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో నిందితుడు ఆనంద్ తేల్తుంబ్డే(73)కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.