న్యూఢిల్లీ, జూన్ 18: అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఇంత భారీయెత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతాయని తాను ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని ఆయన ఆందోళనకారులను కోరారు.
అగ్నిపథ్పై తప్పుడు సమాచారం, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే దేశంలో నిరసనలు రేగాయని శుక్రవారం వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ స్కీమ్ ప్రణాళిక బృందంలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని, దాదాపు ఏడాదిన్నర పాటు దీనిపై పనిచేశామని చెప్పారు.