R Harikumar | భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కుషాభౌ థాకరే హాల్లో కంబైన్డ్ కమాండర్స్ కార్ఫరెన్స్-2023 జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన వెంటనే ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు.
ఈ క్రమంలో సదస్సులో పాల్గొన్న దాదాపు 1300 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగాలోనే అడ్మిరల్ ఆర్ హరికుమార్కు పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 20 మందికి సైతం కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2023 మూడు రోజుల పాటు జరిగింది. మార్చి 30న ప్రారంభమై.. శనివారం ముగిసింది.