ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా సోమవారం లోక్సభలోని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హనుమాన్ చాలీసాకు సంబంధించి వివాదం నేపథ్యంలో ముంబైలోని ఖార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత అరెస్టు చేసిన విషధితమే. ఈ క్రమంలో పోలీసులు తనతో అమానవీయంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ ముందు తన వాదనలు వినిపించారు. గత నెలలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్కే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు.
ఆ తర్వాత నవనీత్ రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఆమె మాట్లాడుతూ లోక్సభ స్పీకర్ ఎంపీలకు సంరక్షకుడన్నారు. తమ కేసులో న్యాయం జరిగేలా చూడాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కమిటీని కోరినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాత అనంతర పరిస్థితులపై వివరించానని తెలిపారు. హనుమాన్ చాలీసా పఠనం నేపథ్యంలో ఏప్రిల్ 23న నవనీత్ రాణా దంపతులను అరెస్టు చేయగా.. మే 5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు లోక్సభ సెక్రటేరియట్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవనీత్ రాణా అరెస్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరాయి.