చండీఘఢ్ : కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కార్పై పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా విమర్శల దాడికి దిగారు. భారత్లో పంజాబ్ అత్యధక రుణభారం కలిగిన రాష్ట్రమని సిద్ధూ వరుస ట్వీట్లలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పంజాబీ, పార్టీ కార్యకర్త లేవనెత్తుతున్న వాస్తవ అంశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టరాదని ఆయన హితవు పలికారు.
ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర జీడీపీలో అప్పులు 50 శాతం వరకూ ఉన్నాయని, ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో సగం అధిక వడ్డీకి తెస్తున్న రుణాలేనని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వాస్తవ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం మరుగుపరచరాదని వ్యాఖ్యానించారు. డ్రగ్ మాఫియా సహా పలు అంశాలపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ గత కొంతకాలంగా సొంత ప్రభుత్వాన్నే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.