(Navjot Kaur) జలంధర్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్.. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కి బహిరంగ సవాలు విసిరారు. అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై కెప్టెన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పాపులారిటీ ఎంతో తెలుస్తుందని కౌర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధూని గెలిచేందుకు అనుమతించకూడదని కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన ప్రకటనపై నవజ్యోత్ కౌర్ తొలిసారిగా స్పందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ-సిద్ధూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూను దేశ వ్యతిరేకి అని అమరీందర్ సింగ్ అన్నప్పుడు కూడా నవజ్యోత్ కౌర్ బలంగానే తిప్పికొట్టారు. ఒకవేళ దేశ వ్యతిరేకి అయి ఉంటే సిద్దూ దేశం కోసం ఆడేవారు కాదని చెప్పారు. ‘సిద్ధూ క్రికెటర్గా పాకిస్తాన్ వెళ్లాడు.. యాదృచ్ఛికంగా కర్తార్పూర్ కారిడార్ ప్రారంభానికి మార్గం సుగమం చేశాడు. సిద్ధూకు అక్కడికి అందిన గౌరవాన్ని చూసి కెప్టెన్ తట్టుకోలేకపోయాడు’ అని కౌర్ అన్నారు. పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవడం కంటే పాకిస్తానీని ఇంట్లో ఉంచుకోవడం చాలా ప్రమాదకరమని కెప్టెన్ పాకిస్తానీ జర్నలిస్ట్తో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మరోసారి సిద్ధూను గెలవనీయకుండా చూడాలని ప్రజలకు పిలుపునీయడంతో కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్సర్లో పోటీకి వస్తే ఎవరి పాపులారిటీ ఎంతో తేలుతుందని ఘాటుగా జవాబిచ్చారు. చన్నీ-సిద్ధూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరు కూడా పంజాబ్ అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు.
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..