న్యూఢిల్లీ, ఆగస్టు 26: జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు 2004-05, 2020-21లో రూ.15,077 కోట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందినట్టు తెలిపింది. అలాగే 27 ప్రాంతీయ పార్టీలకు కూడా ఇలా నిధులు అందుతున్నాయని వెల్లడించింది.
ఇందులో టాప్-5లో వైఎస్ఆర్ కాంగ్రెస్ (రూ.96 కోట్లు), డీఎంకే (రూ.80 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఎంఎన్ఎస్ (రూ.5 కోట్లు), ఆప్ (రూ.5 కోట్లు) ఉన్నాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.690 కోట్ల విరాళాలు అందాయని వివరించింది. పార్టీల ఐటీ రిటర్న్స్, ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఆదాయ వివరాలను పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కలు తేల్చినట్టు ఏడీఆర్ తెలిపింది.