న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) విద్యార్థి దేవల్ కరియా ఈ ఏడాదికి గాను జేమ్స్ డైసన్ జాతీయ అవార్డును గెలుచుకొన్నారు. గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించడంలో ఇబ్బందులను అధిగమించడానికి, అవయవం పాడవకుండా ఎక్కువ సేపు నిల్వ ఉండటానికి అతడు ‘లైఫ్ బాక్స్’ను తయారు చేశారు. దీనికి గాను ఆయన జేమ్స్ డైసన్ జాతీయ అవార్డును గెలుచుకొన్నారు. ఈ డిజైన్తో పాటు ఇండియా నుంచి మరో రెండు ఆవిష్కరణలు అంతర్జాతీయంగా 27 దేశాలకు చెందిన 81 డిజైన్లతో పోటీ పడనున్నాయి. వీటిలో 20 డిజైన్లను షార్ట్ లిస్ట్ చేసి వచ్చే నెల 13న ప్రకటిస్తారు. జేమ్స్ డైసన్ అంతర్జాతీయ విజేతను నవంబర్లో ప్రకటిస్తారు.