95% సామర్థ్యం.. భారత్లో విడుదల?
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ము క్కు రంధ్రాల్లో కరోనాను చంపేసే నాజల్ స్ప్రేను భారత మార్కెట్లోకి తీసు కొచ్చేందుకు కెనడాకు చెందిన సానోటైజ్ సంస్థ రెడీ అవుతున్నది. తాము రూపొందించిన స్ప్రే సార్స్-కొవిడ్-2ను ఎదుర్కోవటంలో 95శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, ఊపిరితిత్తులకు వ్యాపించకుండా అడ్డుకొంటుందని వెల్లడించింది. ఇప్పటికే యూకేలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఈ స్ప్రే ఇజ్రాయెల్లో తయారవుతున్నదని తెలిపింది. భారత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని సంస్థ సీఈవో, కో-ఫౌండర్ ఆఫ్ సానోటైజ్ డాక్టర్ గిల్లీ రీగవ్ తెలిపారు.