న్యూఢిల్లీ : సూర్యునిపై మండుతున్న విస్ఫోటనాల మధ్య సౌర తుఫాను భూమిని తాకే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుని కార్యకలాపాలలో ఇటీవల ఆకస్మాత్తుగా పెరుగుదల కన్పిస్తున్నది. సూర్యరశ్మి తీవ్రత పెరగడమే కాక, అవి వేడి ప్లాస్మా ప్లూమ్లను అంతరిక్షంలోకి వెదజల్లుతున్నది.
నవంబర్ 25లోగా మన ఆయస్కాంత క్షేత్రాన్ని, వాతావరణాన్ని తాకుతుందని నాసాను ఉటంకిస్తూ న్యూస్ వీక్ నివేదించింది. విద్యుత్ అయస్కాంత ప్రభావంతో సూర్యుని సౌర మంటలు కూడా రావొచ్చునని నాసా హెచ్చరించింది.