న్యూఢిల్లీ: తాజా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వరుసగా మూడవ సారి ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ నేత ప్రహ్లాద్ జోషీ తెలిపారు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ మీటింగ్లో ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 ఎంపీ సీట్లను గెలుచుకున్నది. అయితే 272 మ్యాజిక్ మార్క్ దాటినా.. బీజేపీ మాత్రం ఒంటరిగా ఆ ఫిగర్ను అందుకోలేదు. దీంతో జేడీయూ, టీడీపీ కీలకంగా మారాయి.
#WATCH | Delhi: Newly elected MPs, Chief Ministers and other leaders of the NDA chant ‘Modi-Modi’ during the NDA Parliamentary Party meeting at Samvidhan Sadan (Old Parliament) pic.twitter.com/WuFZz9YAbD
— ANI (@ANI) June 7, 2024
పాత పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో.. మోదీ-మోదీ నినాదాలతో హోరెత్తించారు. కొత్త ఎంపీలు, సీఎంలు, ఇతర ఎన్డీఏ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్కు వచ్చిన ఎన్డీఏ నేతలకు మొదట ప్రధాని మోదీ స్వాగతం పలికారు. సంవిదాన్ సదన్లోని సెంట్రల్ హాల్లోకి వచ్చిన మోదీ.. తొలుత అక్కడ ఉంచిన రాజ్యాంగం పుస్తకాన్ని కండ్లకు అద్దుకున్నారు. ఆ పుస్తకానికి ఆయన నమస్కరించారు. ఆ తర్వాత మోదీ మీటింగ్లో పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi respectfully touches the Constitution of India with his forehead as he arrives for the NDA Parliamentary Party meeting.
Visuals from the Central Hall of the Samvidhan Sadan (Old Parliament). pic.twitter.com/JU6D9M0Jca
— ANI (@ANI) June 7, 2024