న్యూఢిల్లీ: తూర్పు లఢక్ ప్రాంతంలో చైనా బలగాలను మోహరిస్తుండటం, నిర్మాణాలను చేపడుతుండటం ఆందోళనకర అంశమని ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. చైనా కదలికలపై కన్నేసి ఉంచామని చెప్పారు. తూర్పు లఢక్లోని మిగతా ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణపై భారత్, చైనా సైనికాధికారులు ఆదివారం చర్చలు జరుపనున్నారు. కాగా, అఫ్గానిస్థాన్లో పరిస్థితి కుదుటపడిన తర్వాత ఆ దేశానికి చెందిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్లోకి చొరబడే ప్రమాదమున్నదని నవవణే హెచ్చరించారు. గత తాలిబన్ పాలనలో ఇలాంటి పరిస్థితిని చూశామన్నారు.