Congress | మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే ప్రధాని మోదీని కొట్టగలనని, దుర్భాషలు కూడా ఆడగలనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజద్ పూనావాల ఈ వీడియోను పోస్ట్ చేశారు. పంజాబ్ వేదికగా జరిగిన ఘటన కుట్రపూరితమైందని తామెందుకు అంటున్నామో ఇప్పటికన్నా అర్థమైందా? అని షెహజద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేసింది. స్థానికంగా ఉండే ఓ రౌడీ పేరు చివర కూడా మోదీ అని ఉంటుందని, ఆయన్ను దృష్టిలో ఉంచుకొని చేసినవి వివరణ ఇచ్చింది. నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవి మాత్రం కావని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అతుల్ లోంధే పేర్కొన్నారు.