Myanmar-India | ఇల్లు మాత్రం ఒకటే.. కానీ, కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్లాలంటే మాత్రం దేశ సరిహద్దులు దాటాల్సిందే. అదేంటి అని అనుకుంటున్నారా..? ఎందుకంటే బెడ్రూమ్ భారత్లో ఉంటే కిచెన్ మాత్రం మయన్మార్లో ఉంది కాబట్టి.
నాగాలాండ్లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే..? భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా ఉంటారు. ఈ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. ఆంగ్ నివసించే ఇల్లు మాత్రం ఇండియా-మయన్మార్ను వేరు చేస్తుంది. ఇంట్లోని కిచెన్ మయన్మార్లో ఉంటే… బెడ్రూమ్ మాత్రం భారత్లో ఉండటం విశేషం.
ఈ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘ఆ కుటుంబ సభ్యులు భారత్లో పడుకుంటారు.. మయన్మార్లో తింటారు..’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి మరి..!
OMG | यह मेरा इंडिया
To cross the border, this person just needs to go to his bedroom.
बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃
@incredibleindia
@HISTORY
@anandmahindra pic.twitter.com/4OnohxKUWO— Temjen Imna Along (@AlongImna) January 11, 2023