కోహిమా: నాగాలాండ్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన ఆ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారంతో గడువు మగిసింది. అయితే ఆఖరి క్షణాల్లో తను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
దీంతో బీజేపీ అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి. శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది.