న్యూఢిల్లీ, మార్చి 5: దేశపు మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని బుధవారం ప్రధాని మోదీ కోల్కతాలో ప్రారంభించనున్నారు. రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా పిలుస్తున్నారు.
హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భం(జలాంతర్గ)లో ఉన్నాయి. బుధవారం నుంచే ఈ మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.