శ్రీనగర్: దేశ సరిహద్దులోని నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడుకు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. (blast near LOC) జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం గుల్మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) సమీపంలో ‘ఆశా పోస్ట్’ వద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు.
కాగా, మృతుడిని బారాముల్లా జిల్లాలోని చందూసా ప్రాంతానికి చెందిన జాబిర్ అహ్మద్ బజాద్గా గుర్తించారు. గాయపడిన నలుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు కారణాలు ఏమిటన్నది తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పాత బాంబు షెల్ను తాకడం లేదా కదిలించడం వల్ల ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడు పదార్థారం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.