Akhilesh Yadv : కేంద్ర ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అకారణంగా తన హెలికాప్టర్ను నిలిపేశారని, ముజఫర్ నగర్కు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. ఒంటి గంటకు ముజఫర్నగర్లో పాత్రికేయుల సమావేశం ఉందని, అయినా తాను ఇంకా ఢిల్లీలోనే ఉండిపోయానని అన్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ ఓ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలో అకారణంగా నా హెలికాప్టర్ను నిలిపేశారు. ముజఫర్నగర్ వెళ్లనివ్వడం లేదు. ఇప్పుడే బీజేపీకి చెందిన ఓ అగ్రనేత ఇక్కడి నుంచే ఫ్లైట్ ఎక్కారు. ఇది బీజేపీ కుట్ర అని అందరికీ అర్థమవుతోంది.’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు. సమాజ్వాదీ అధ్యక్షుడు శుక్రవారం మీరట్, ముజఫర్ నగర్లో పర్యటించాల్సి వుంది.