ముంబై: మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగస్వామ్య పక్షాలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఛత్రపతి శివాజీతోపాటు మరికొందరు మహానాయకులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. గవర్నర్ను తొలగించకపోతే ఏక్నాథ్ షిండే సర్కార్కు గుణపాఠం చెప్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హెచ్చరించారు.