జైపూర్, నవంబర్ 14: రాజస్థాన్ బీజేపీ ఎంపీ, తిజారా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి బాబా బాలక్నాథ్ సోమవారం భివాడీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ కబిలస్(గిరిజనులు) ఏకమయ్యారు. మనం ఓటింగ్ శాతం ద్వారా వాళ్ల ప్రణాళికలను ఓడించాలి.
దాంతో వాళ్లు భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఏకమై మన సనాతన ధర్మాన్ని ఓడించే సాహసం చేయరు’ అని ఆయన అన్నారు. అయితే కబిలస్ ఎవరనే దానిపై ఆయన మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ఎన్నికలను ఆయన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్తో పోల్చారు.