శ్రీనగర్: కొందరు గుర్తు తెలియని ఆర్మీ జవాన్లు మసీదులోని ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు చేయించిన ఘటన కశ్మీర్లో వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని జదూరాలోని ఓ మసీదులో ఆర్మీ జవాన్లు గ్రామస్తులతో బలవంతంగా జై శ్రీరామ్ నినాదాలు చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారిని తీవ్రంగా కొట్టినట్టు గ్రామస్థులు ఆరోపించారు. మసీదులోకి వచ్చిన సైనికులు బెదిరించి జై శ్రీరామ్ నినాదాలు చేయించారని తెలిపారు. మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఘటనను ఖండించారు.