బెంగళూరు: దసరా నవరాత్రుల నేపథ్యంలో ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. చనిపోయిన ఆమె భర్త ఈ హిందూ ఆలయాన్ని కట్టించడం మరో విశేషం. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్ సిటీలో ఈ ఘటన జరిగింది.
రైల్వే ఉద్యోగి అయిన తన భర్త 50 ఏండ్ల కిందట భగవతి అమ్మ దేవాలయాన్ని నిర్మించి హిందూ సమాజానికి అప్పగించారని ముస్లిం మహిళ ఫమీదా తెలిపారు. ఈ నేపథ్యంలో దసరాను పురస్కరించుకుని మరణించిన తన భర్త నిర్మించిన ఆలయంలో అమ్మవారికి పూజలు చేసినట్లు ఆమె చెప్పారు.